Saturday, May 30, 2015

విశిష్ట పురస్కారం " భారత రత్న " గురించి

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడ ఉన్నారు. ఈ పురస్కారం 13 జులై 1977 నుండి 26 జనవరి 1980 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. మరియు ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.
ఎలాంటి జాతి, ఉద్యోగం,స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది.
భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.
ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధి గా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987) మరియు నెల్సన్ మండేలా (1990) ఉన్నారు.
భారతరత్న పురస్కారం పొందిన వారి జాబితా
పేరు సంవత్సరం
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) 1954
చక్రవర్తుల రాజగోపాలాచారి (1878-1972) 1954
డా.సి.వి.రామన్ (1888-1970) 1954
డా. భగవాన్ దాస్ (1869-1958) 1955
డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) 1955
జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) 1955
గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) 1957
ధొండొ కేశవ కార్వే (1858-1962) 1958
డా. బీ.సీ.రాయ్ (1882-1962) 1961
పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) 1961
రాజేంద్ర ప్రసాద్ (1884-1963) 1962
డా. జాకీర్ హుస్సేన్(1897-1969) 1963
పాండురంగ వామన్ కానే (1880-1972) 1963
లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) 1966
ఇందిరాగాంధీ (1917-1984) 1971
వీ.వీ.గిరి (1894-1980) 1975
కే.కామరాజు (మరణానంతరం) (1903-1975) 1976
మదర్ థెరీసా (1910-1997) 1980
ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982) 1983
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) 1987
యం.జి.రామచంద్రన్ (మరణానంతరం) (1917-1987) 1988
బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం) (1891-1956) 1990
నెల్సన్ మండేలా (జ. 1918) 1990
రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) 1991
సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) 1991
మొరార్జీ దేశాయి (1896-1995) 1991
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) 1992
జే.ఆర్.డీ.టాటా (1904-1993) 1992
సత్యజిత్ రే (1922-1992) 1992
సుభాష్ చంద్ర బోస్ (1897-1945) (తరువాత ఉపసంహరించబడినది) 1992
ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931) 1997
గుర్జారీలాల్ నందా (1898-1998) 1997
అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995) 1997
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004) 1998
సి.సుబ్రమణ్యం (1910-2000) 1998
జయప్రకాశ్ నారాయణ్ (1902-1979) 1998
రవి శంకర్ (జ. 1920) 1999
అమర్త్య సేన్ (జ. 1933) 1999
గోపీనాథ్ బొర్దొలాయి (జ. 1927) 1999
లతా మంగేష్కర్ (జ. 1929) 2001
బిస్మిల్లా ఖాన్ (జ 1916) 2001
భీమ్ సేన్ జోషి (జ. 1922) 2008
సచిన్ టెండూల్కర్ 2014
సి. ఎన్. ఆర్. రావు 2014
మదన్ మోహన్ మాలవ్యా 2015
అటల్ బిహారీ వాజపేయి 2015

చక్కటి ఆరోగ్యానికి చిట్కాలు

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.