Tuesday, July 17, 2012

గోదావరి పుట్టుక


ఈ దివ్యసూచ చేసినందుకు ఆ బ్రాహ్మణునికి మొక్కి కౄతజ్ణ్జతలు చెప్పుకొని గౌతముడు సతీసమేతంగా హేమవనానికి వెళ్ళాడు. అక్కడ ఒంటికాలు మీద నిలిచి శివుని గురించి తీవ్ర తప్పస్సు చేశాడు. శివుడు మెచ్చి తన జడపాయనొకదానిని పెరికి గౌతమునికిచ్చి పిండమన్నాడు. పిండగా నీరు నేలమీద పడి నదిగా ప్రవహించింది. ఆ నదే గోదావరి. గౌతముని తపోఫలంగా అవతరించింది కనుక ‘గౌతమీ అయింది. గోవును బతికించింది కనుక గోదావరి అయింది.


ఈ కథకే పాఠాంతరం ఉంది. గౌతముని అతిథ్యం పొందిన బ్రాహ్మణులే అతని కీర్తినీ, అన్న సంపదనూ చూసి ఓర్వలేక మాయ గోవును సౄష్టించి అతని పొలంలోకి విడిచిపెట్టారని, గౌతముడు అదలించబోగా అది మరణించడంతో గోహత్యా కళంకాన్ని అతనికి అపాదించారని దీని సారాంశం. అయితే రెండు కథల్లోనూ ఉమ్మడిగా ఉన్న అంశం కరవుకాటకాలతో ప్రజలను గౌతముడు అదుకోవడం, గంగను నేలమీదికి రప్పించడం. దీనినిబట్టి గౌతముడు నదీజలాలను పంట భూములకు మళ్ళించి కరవుకాటకాలను నివారించడంలో ప్రముఖపాత్ర వహించిన మేధావి అనీ, నేటి భాషలో చెప్పుకోవాలంటే గొప్ప ‘ఇరిగేషన్ ఇంజనీర్ ‘ అని అర్థమవుతుంది. ఇలా తన మేధాశక్తిని లోకకల్Yఆణానికి వినియోగించాడు. కనుకనే గౌతముడు మహర్షిగా చరితార్థుడయ్యాడు.

No comments:

Post a Comment