Monday, May 19, 2014

కష్టం వచ్చిందని ఎప్పుడూ అధైర్యపడకండి

కష్టం వచ్చిందని ఎప్పుడూ అధైర్యపడకండి. ఎందుకంటే మీరు లోకాన్ని చూడగలిగేది అప్పుడే. ఎవరు ఎలాంటి వారో నిర్ణయించేది ఆ సమయంలోనే. ఎవరు మిత్రుడో, ఎవరు శత్రువో తెలుసుకోవచ్చు. అలానే సంపదలేనప్పుడు ఎలా ఉండాలి? కాలం కలసిరానప్పుడు ఎవరితో ఎలా ఉండాలి. అనేది కూడా మీకు ఆ సమయంలోనే తెలుస్తుంది.
అన్నీ ఉన్నప్పుడు, అన్నీ కలిసి వస్తున్నప్పుడు నేను గొప్ప అని ఎవరైనా చెప్పగలరు. కాని కష్టం వస్తే మాత్రం క్రుంగిపొకుండా నిలబడేవాడే గొప్పవాడు. వీడినే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు.

ఉదహరణకి నేను ఒక అమ్మయిని ఇష్టపడ్డాను. ఆలోచిస్తున్నా అంటుంది ఎప్పుడు అడిగినా! అలా కాదు అని గట్టిగా ప్రయత్నించాను. ఆ అమ్మాయి కూడా గట్టిగా తిట్టింది. నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పించి. అలాగని నేను బెంగపెట్టుకుని కూర్చుంటే నిత్యం మనం చేసే పని ఎవరు చేస్తారు. నా కార్యాలయం ఎవరు చూస్తారు? నన్ను అభిమానించే తల్లి, స్నేహితులని ఏమి చేయాలి? నేను ఇచ్చె సందేశాలు కోసం ఎదురు చూసే 30000 మందికి ఎవరు సందేశాలు ఇస్తారు? ఇవన్ని కాదు. అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలుసుకోకుండా అర్ధాంతరంగా అన్ని పనులు ఆపేసి బెంగ పెట్టుకుని కుర్చుని, లేకపోతె ప్రాణం తీసుకుంటే మళ్లి దిక్కుమాలిన జన్మ ఎత్తాలి. ఎప్పుడు కూడా ఎవరికోసమో జీవితాన్ని త్యాగం చేయకూడదు. అలాగని ఇష్టపడిన వారు ఏదో అన్నారని వదిలియనూకూడదు. కొంచం సమయం పట్టినా గెలుచుకోవాలి. నేను చేసే వ్యాపారం కూడా ఎత్తు పల్లాలు వస్తున్నాయి. అలాగని వ్యాపారం ఆపేయలేను కదా! అమ్మ అరిచింది, నాన్న కొట్టాడు, ఉపాద్యాయుడు మార్కులు తక్కువ వేశాడు, అమ్మాయి నా ప్రేమని కాదు అంది, వ్యాపారంలో నష్టపోయాను, స్నేహితుడు మోసం చేశాడు, ఇవన్ని మన మనస్సుకు చెప్పుకునే వంకలు, ఎదుటివారికి చెప్పే అబద్దాలు. ఏది నీ చేతిలోలేదు. ఈ నిజం గ్రహించు. అలాగే ఆదర్శంగా నిలబడాలి. కష్టం వచ్చినప్పుడే నీలో ఉన్న నిజమైన వ్యక్తీ బయటికి వస్తాడు.

తీసుకురావాలి కూడా! ఇలాంటి చిన్న విషయాలకే కలత చెందితే రేపటి రోజున ఏ సమస్యని ఎదుర్కోలేవు. ప్రతి విషయంలో పారిపోవడనికే ప్రాదాన్యం ఇవ్వాలి. ఎందుకంత ఖర్మ..! అలాగే వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, జీవితం అయినా ఇంకా ఏ సమస్యని అయిన ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి. నీ ధైర్యమే తరువాతి నీతరాలకి అందించే జ్ఞాన శక్తి. జ్ఞాన సంపద. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడండి.

ఇంద్రియాలని ఎలా నిగ్రహించాలి?

ప్రస్తుత కాలంలో మనిషి ఇంద్రియ సుఖాల కోసం తప్ప మరొకదాని కోసం సమయాన్ని వెచ్చించడం లేదు. ఏదైనా అలాగైన సుఖంగా బ్రతకడమే లక్ష్యంగా ప్రస్తుత యువత ఆలోచిస్తుంది. ప్రత్యేకించి పట్టణాల్లో యువత ఈదిశగా ఆలోచనలు చేస్తుంది అని కొన్ని ప్రత్యెక సర్వేలలో తేల్చారు.

కంటికి నచ్చిందని ఏదిపడితే అది చూడటం, చెవికి ఇంపుగా వుంది అని పెద్ద శబ్దాలతో అడ్డమైన సంగీతం వినడం, నాలుక రుచి కోసం పిజ్జాలు, బర్గర్లు, రోడ్డుమీద కనపడే అడ్డమైన చెత్త లోపలవేసి లేనిపోని రోగాలు కొని తెచ్చుకోవడం, పార్టిలు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, బీర్లు ఇలా లేనిపోని వ్యసనాలకి లోనుకావడం ఇలా సాగుతుంది నాగరిక ప్రపంచం. ఈ నాగరిక ప్రపంచ మైకంలో మనిషి తయారుచేసిన వినాశనం తెచ్చే వాటివైపు మొగ్గు చూపుతున్నారు.ప్రకృతి ఇస్తున్న సహజ వనరులని కూడా నాశనం చేస్తున్నారు.

ఉదాహరణ : దేవుడు ఒక చేపని సృష్టించాడు. అది బ్రతకాలంటే నీరు కావాలి కనుక మేఘం ఇచ్చాడు. మేఘం కరిగి నీరు రావాలంటే వాయువు కావాలి. వాయువుని సృష్టించాడు. ఈ వాయువు రావాలంటే చెట్టు కావాలి కాబట్టి చెట్టుని సృష్టించాడు.. ఆ చెట్టు నిలవడానికి నేల కావాలి భూమిని సృష్టించాడు. ఇవన్ని సృష్టించి చేపని నీటిలోకి వదిలాడు. మరి దీనికి ఆహారం కావాలి కదా! అందుకని నాచుని కూడా సృష్టించి ఇచ్చాడు. చేప వాటిని ఉపయోగించుకొని బాగా బలంగా పెరిగింది. ఒంటరిగా ఉండలేదు కదా అందుకోసం దీనికి జంటని కూడా పంపించాడు. చాలాకాలం జరిగింది. ఈ చేపల జంటకి పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటికి మరిన్ని పిల్లలు పుట్టాయి. చేపలు బాగా పెరిగాయి. సుఖంగా ఉంటున్నాయి. ఇది వీటికి నచ్చలేదు. కొత్తగా ఏదైనా తినాలి తినాలి అనుకుంటూ ఉన్నాయి. ఇంతలో మనిషి ఒక ఎరని గాలానికి గుచ్చి నీటిలో వేశాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న చేప ఆ ఎరని చూసింది. వచ్చి లటుక్కున పట్టుకుంది. గాలం కసక్కున దిగింది. ఆ బాధని తట్టుకోలేక తన్నుకుంటున్న చేపని మనిషి గాలం నుండి పీకి (జాగ్రత్తగా ఏమి తీయలేదు. ఒక్క సారిగా లాగేసరికి మూతి ఊడి వచ్చింది.) బుట్టలో వేశాడు. అప్పుడు అనుకుంది. నాకోసం దేవుడు సృష్టించి ఇచ్చిన అన్ని సౌకర్యాలు కాదని కొత్తవాటి మోజులో పడి చివరికి దిక్కులేని చావు చావాల్సివచ్చింది. అనుకుని ప్రాణం వదిలేసింది.

మనసు కోతిలాంటిది. బుద్ది దాని అధీనంలో ఉంటుంది. మనస్సుని అదుపు చేయలేకపోతే బుద్ది నిన్ను అనేక వంకర్లు నిన్ను తిప్పుతుంది. నువ్వు ఒక పనికోసం బయలుదేరితే మద్య దారిలో ఇంకోదాని మీదకి మళ్ళిస్తుంది. నువ్వు చదవాలి అని పుస్తకం పట్టుకుంటే ఇంకో పుస్తకమో లేక ఇంకో వ్యాపకమో గుర్తుచేసి అటువైపు మళ్ళిస్తుంది. కాబట్టి నచ్చింది అని కనపడిన ప్రతిదాని వెనక పడకండి. మీకు నచ్చలేదని ఎవరిని దూషించకండి. ఇదంతా సాధన ద్వారానే సాధ్యం అవుతుంది.

వ్యక్తిత్వ వికాసం - అలోచించి మాట్లాడండి

ఒక విషపు చుక్క కడివెడు పాలని విషంగా మార్చేస్తాయి. అలాగే కొందరు మాట్లాడే మాటలు సందిగ్ధంలో ఉన్నవారి ఆలోచనలని ప్రభావితం చేస్తాయి. కాబట్టి దయచేసి కొంచం అలోచించి మాట్లాడండి.

       కృతయుగంలో ధర్మం 4పాదాలమీద నడిచింది. ఇలాంటి సమయంలో ఎవరు ఎవరికీ ఏమి చెప్పేపని లేదు. స్వతహాగా జ్ఞానులు ఎవరి పనిలో వారు వుండేవారు.

       త్రేతాయుగంలో 3పాదాలమీద నడిచింది. ధర్మం కొంచం అదుపు తప్పింది. నిలబెట్టడానికి రాముడు దిగివచ్చాడు.

        ద్వాపరయుగంలో 2పాదాలమీద నడిచింది. అధర్మం పాళ్ళు ఎక్కువైనది. సాక్షాత్తు విష్ణువు అంశలో కాకుండా కృష్ణుడిగా పరిపూర్ణ అవతారంగా దిగివచ్చి 73 కోట్లమందికి పైగా సంహరించాడు.

       ఇది కలియుగం. దీనికి కలహాయుగం అని కూడా పేరు ఉంది. కలియుగం ప్రారంభానికి ముందు ఋషులు అందరూ భయపడి వశిష్టుడు, విశ్వామిత్రుడు, కౌండిల్యుడు, ఇలాంటి మహామహులైన మునులు కలికి భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి కలి ప్రవెసించబొతున్నాడు. మేము భూమి మీద ఉండలేము, కలి ప్రవేశించని ప్రాంతం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ తన మనోనేత్రం నుండి బండి చక్రం తీసి (ఎడ్లబండి చక్రాలు తెలుసుకదా, అది) భూమి మీదకి దొర్లించి ఇది ఎక్కడ పడి ముక్కలవుతుందో ఆప్రాంతంలోకి కలి ప్రవేశించడు అన్నాడు. అది దొర్లుకుంటూ వచ్చి భూమి మీద పడి ముక్కలయ్యింది. అదే నైమిశారణ్యంలో ఉన్న చక్రతీర్ధం. ఇక్కడ మన కంటికి కనపడకుండా ఎందరో మునులు, ఋషులు యజ్ఞ యాగాదులు చేస్తూ భూమిని సంరక్షిస్తున్నారు.
ఇలాంటి ఋషులే కలికి భయపడితే మనం ఎంత? చెడు వెళ్ళినంత వేగంగా మంచి వెళ్ళలేదు.

ఒక రాజు, యేడుగురు కొడుకులు

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు వుండేవారు, ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండీవారు. ఒక రోజు ఆ యేడుగురు కొడుకులు చాపలు పట్టడానికి వెళ్ళారు. యేడు చేపలు తెచ్చారు. ఆ తెచ్చిన చేపలిని యెండబెట్టారు.
సాయంత్రానికి ఆరు చేపలు యెండాయి కాని, యేడొ చాప యెండలేదు. ఆ చేపను పట్టిన రజకుమారుడు చేపని “చేప చేప ఎందుకు యెండలెదు” అని అడిగాడు. ఆ చేప “గడ్డిమెటు అడ్డమొచ్చింది” అని బదులు చెప్పింది. ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమేటుని “నా చేప యెండకుండా యెందుకు అడ్డం వచ్చావు?” అని అడిగాడు. గడ్డిమెటు అందీ “ఈ రోజు ఆవు నన్ను మేయడానికి రాలెదు” అని.
రాజకుమరుడు వెంటనే ఆవు దెగ్గరికి వెళ్ళి, “ఈ రోజు నువ్వు గడ్డి యెందుకు మెయలేదు?” అని అడిగాడు. “నన్ను ఈ రోజు పాలేరాడు తీసుకెళ్ళలెదూ” అని చెప్పింది.
రాజకుమరుడు పాలేరాడిని అడిగాడు “యెందుకు ఈ రోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకుని వెళ్ళలేదు” అప్పుదు పాలెరాడు ఇల అన్నదు, “అమ్మ నాకు అన్నం పెట్టలేదు” అని.
అమ్మ ని అడిగితే అమ్మ అందీ “ఆక్కడ పాప యెడుస్తొంది”
రాజకుమారుడు పాపని “పాప, పాప, యెందుకు యేడుస్తున్నావూ” అని అడిగితే, పాప “నన్ను చీమ కుట్టింది” అని గుక్కలు పెడుతూ చెప్పింది.
రాజకుమారుడు పట్టువదలని విక్రమార్కుడు లాగ చీమ ని కూడ అడిగాడు “చీమ చీమ పాపని యెందుకు కుట్టావూ”
ఆప్పుదు చీమ అంది “నా పుట్టలో వేలు పెడితె నేను కుట్టనా” అని…
చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు ఈ కథ చెప్పేది. చాల కాలం ఇదొక మాములు కథ అనుకున్నను. పెద్దయ్యక మా పిల్లలకు ఈ కథ చెపుతున్నప్పుడు అర్ధం అయ్యంది. ఒకొక్క సారి చాల చిన్న చిన్న సంఘటనలకు పెద్ద పెద్ద ఫలితాలు ఉంటాయని. చిన్న పాపను చీమ కుడితే ఆ రోజు రాజకుమారుడికి రాత్రి భోజనం లో యెండు చాప లేదు. 

Sunday, December 8, 2013

ఆహారశుద్ధి నియమం

భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడదు, భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము, ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట.
మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము. శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెదిరతే దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చుపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను. సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు.
“జంతూనాం నరజన్మ దుర్లభం”–అన్నారు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా– చెదారము తినేటి జంతువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,.. ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము. మనమూ అటువంటి ధర్మాన్ని పాటిద్దామా… ….

కౌరవులు - వారిపేర్లు

కౌరవులు
దుర్యోధన
దుశ్శాసన
దుస్సహ
దుశ్శల
జలగంధ
సామ
సహ
వింద
అనువింద
దుర్దర్శ
సుబాహు
దుష్ప్రదర్శన
దుర్మర్శన
దుర్ముఖ
దుష్కర్ణ
కర్ణ
వికర్ణ
శాల
సత్వ
సులోచన
చిత్ర
ఉపచిత్ర
చిత్రాక్ష
చారుచిత్ర
శరాసన
దుర్మద
దుర్విగాహ
వివిత్సు
వికటాసన
ఊర్ణనాభ
సునాభ
నంద
ఉపనంద
చిత్రభాను
చిత్రవర్మ
సువర్మ
దుర్విమోచ
అయోబాహు
మహాబాహు
చిత్రాంగ
చిత్రకుండల
భీమవేగ
భీమబల
బలాకి
బలవర్ధన
ఉగ్రాయుధ
సుసేన
కుండధార
మహోదర
చిత్రాయుధ
నిశాంగి
పాశి
బృందారక
దృఢవర్మ
దృడక్షత్ర
సోమకీర్తి
అనుదార
దృఢసంధ
జరాసంధ
సత్యసంధ
సదాసువాక్
ఉగ్రశ్రవస
ఉగ్రసేన
సేనాని
దుష్పరాజయ
అపరాజిత
కుండశాయి
విశాలాక్ష
దురాధర
దృఢహస్త
సుహస్త
వాతవేగ
సువర్చస
ఆదిత్యకేతు
బహ్వాశి
నాగదత్త
అగ్రయాయి
కవచి
క్రధన
భీమవిక్రమ
ధనుర్ధర
వీరబాహు
ఆలోలుప
అభయ
దృఢకర్మణ
దృఢరథాశ్రయ
అనాధృష్య
కుండాభేది
విరావి
చిత్రకుండల
ప్రమథ
అప్రమథ
దీర్ఘరోమ
వీర్యవంత
దీర్ఘబాహు
సువర్మ
కనకధ్వజ
కుండాశి
విరజ
యుయుత్సు
కౌరవుల ఏకైక సోదరి దుస్సల

పెళ్ళి-వివాహము

వివాహము అనగా పెండ్లి, పాణిగ్రహణము, కన్యాదానము, పరిణయము, కల్యాణము, సప్తపది అని పలు విధములుగా అర్ధములు ఉన్నవి.
  • జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది.

    వధువు

    • హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీసరస్వతిపార్వతి ల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువుయొక్క కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.

    వరుడు

    • త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు.

    పెళ్ళి చూపులు

    • తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి, సంతోషం ఎవరూ మరువలేరు. సకుటుంబ సపరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరువలేని సంఘటన.
    • పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాంప్రదాయం ప్రకారం అబ్బాయి, అమ్మాయి ఇంటికి బంధువర్గ సమేతంగా వెళ్ళి అమ్మాయిని చూస్తారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయించు కుంటారు

    నిశ్చితార్ధము

    వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు.
    నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్లి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెండ్లి కుమారుడు అని అమ్మాయిని పెండ్లి కుమార్తె అని వ్యవహరిస్తారు.

    ఆహ్వాన పత్రికలు

    • నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారంగా ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. వీటిని శుభలేఖలు|పెళ్ళి పత్రికలు అంటారు. మంగళ సూచకంగా శుభలేఖకు నాలుగువైపులా పసుపు పూస్తారు.

    పెళ్ళి పిలుపులు

    బంధుగణమును పిలుచుకొనుట అనేది పెళ్ళిళ్ళలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అప్పుడెప్పుడూ కలిసే బంధువులందరూ కలువవగలిగే మంచి సంధర్భాలు, పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళివారి ఇల్లు .  మారిపోతుంది.                                                          పెళ్ళి అనగానే పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల ధగధగలు, కొత్తకొత్త వస్తువులు ఇలా అన్నీ కొత్తగా కొనుక్కుంటారు.

    కళ్యాణ మండపము

    కొందరు మండపములను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెలలో కొబ్బరి ఆకుల పందిరి వేయుట వలన మండపంయొక్క ఆవశ్యకత తక్కువ. పట్టణాలలో టిప్ టాప్ పందిరి వేయుట వలన మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

    స్నాతకము

    పెళ్ళి కుమారుని ఇంటిలోగాని, కళ్యాణమండపంలోగాని లేదా విడిదిలోగాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరునిచే గోత్ర ప్రవరలు చేయిస్తారు.

    కాశీప్రయాణం

    బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి’, అని చెప్పి బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు. కొన్ని కులాల వారికి ఈ సంప్రదాయం లేదు.

    వరపూజ (ఎదురుకోలు)

    కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత కన్యాదాత అందరినీ మండపానికి తీసుకెళతాడు.

    గౌరీవృతం    మంగళ స్నానాలు                                                           కన్యావరణము

    బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి ఎదురేగి ‘నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ’ని కన్యాదాత దీవిస్తాడు.

    యజ్ఞోపవీతధా                                                                                    కాళ్ళు కడుగుట                                                                                    సుముహూర్తం (జీలకర్ర, బెల్లం)

    పెళ్ళిచూపులతో ఒక కార్యక్రమం పూర్తి అయిన పిదప వారిరువురి జాతకాల ననుసరించి జ్యోతిష్యములో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లంపెట్టడం జరుగును. ఈ కార్యక్రమమునందు ఈ మంత్రము పఠిస్తారు                                                                               .“ అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే! ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః!! ఓం అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా!!! జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే!!!!

    కాళ్ళు తొక్కించడం

    కన్యాదానందస్త్రం:Pelli.jpg

    దానము అంటే ఇతరులకిచ్చునది. అది విద్య, భూమి, వస్తువు ఇలా వీటిని వారి వారి జీవన విధానానికి అనువుగా మలచుకొనేందుకు ఇస్తారు. అలాగే కన్యాదానము చేసేది వరుడు ఆమెతో సహజీవనము చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని. ఈ క్రింది మంత్రముతో కన్యను వరునికి అప్పగిస్తారు.

    !“ కన్యాం కనక సంఫన్నాం’కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం’బ్రహ్మలోక జగీషియా!!

    పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా.”అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ ” అని ఆపస్థంభం.సప్తవర్షా భవేద్గౌరీ,దశవర్షాతు నగ్నికా,ద్వాదశేతు భవేత్కన్యా,అత ఊర్ద్వం రజస్వలా” భవిష్యపురాణం ప్రకారం 12ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది.”వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది”అని కాశ్యప సంహిత.
    దీని అర్ధం-ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకము వంటి శరీర చాయ కలది. శరీరమంతయు ఆభరణములు కలిగినది. నా పిత్రాదులు సంసారమున విజయము పొంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిపొందినట్టు శృతి వలన విని యున్నాను. నేనూ ఆ శాశ్వత ప్రాప్తి పొందుటకై విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయుచున్నాను.మొత్తము మీద వధువు (భార్య) పురుషార్ధాలైన ధర్మ,అర్ధ,కామ,మొక్షము లకు మూలమని కన్యాదానం చెబుత

    మంగళసూత్రధారణ

    వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు. “ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!! ”

    మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు. వివాహిత స్త్రీ మెడలో మంగళ సూత్రం లేదంటే ఆమెను విధవరాలుగా భావించవచ్చును.

    తలంబ్రాలు

    మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. ‘క్షత’ అంటే విరుగునది- ‘అక్షత’ అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.

     “ ప్రజాపతి స్త్రియాం యశః’ముష్కరోయధధాద్సపం! కామస్య తృప్తిమానందం’తస్యాగ్నేభాజయేహమా!! ”

    బ్రహ్మముడి

    అంగుళీకాలు తీయడం

    ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు. మూత కురచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోస్తారు. దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు. దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం.

    సప్తపది, పాణిగ్రహణం

    సన్నికల్లుతోయం
    రాజహోమం
    స్థాలీపాకం
    నాగవల్లి

    సదస్యం

    నల్లపూసలు
    మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

    అరుంధతీ  నక్షత్రం

    విందువినోదాలు

    పెళ్ళిళ్ళలో విందు వినోదములకు పెద్దపీట వేస్తారు. ఎంత గొప్పగా పెళ్ళి చేసారు అనేది వారు నిర్వహించిన విందు వినోదాల వలననే తెలుస్తుందంటారు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా విందు వినోదాలు జరుగుతాయి.