Thursday, May 10, 2012

మెంతి కారం కూర


కావలసిన పదార్థాలు


  • చిక్కుడుకాయలు. 1/4 కేజీ
  • నూనె. 6 టీస్పూ//.
  • ఉప్పు. తగినంత
  • పసుపు. 1/2 టీస్పూ//.
  • చింతపండు గుజ్జు. 2 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 6
  • ధనియాలు. 2 టీస్పూ//.
  • శెనగపప్పు. 1 టీస్పూ//.
  • మినప్పప్పు. 1 టీస్పూ//.
  • మెంతులు. 1 టీస్పూ//.
  • జీలకర్ర. 1/2 టీస్పూ//.
  • ఇంగువ. చిటికెడు
  • ఎండుకొబ్బరి ముక్కలు. 1/2 కప్పు

తయారు చేయు విధానము :


ముందుగా చిక్కుడుకాయలు కడిగి ముక్కలు చేసి ఉంచాలి. స్టవ్‌ మీద బాణెలిపెట్టి 2 టీస్పూన్ల నూనె వేసి కాగాక, మిరపకాయలు, ధనియాలు, సెనగపప్పు వేయాలి.

అవి సగం వేగిన తరువాత మిగిలిన పోపు సామాను కూడా వేసి ఎర్రగా వేయించి తీయాలి. అదే బాణెలిలో మిగిలిన నూనె పోసి చిక్కుడు ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసి మూతపెట్టాలి.

ఈలోపు వేయించి ఉంచిన పోపు గింజల్ని మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. ఇందులోనే ఎండుకొబ్బరి కూడా వేయాలి.

చిక్కుడుకాయల ముక్కలు కాస్త మెత్తబడ్డాక, నూరుకున్న పొడిని కూరలో వేసి, చింతపండు గుజ్జు కూడా వేసి, కొద్దిగా నీళ్లు పోసి, మంట తగ్గించి మూతపెట్టి ఉడికించాలి. అంతే మెంతికారం కూర రెడీ.

No comments:

Post a Comment