Thursday, May 10, 2012

మెంతి ఆకులతో పనీర్ కర్రీ


కావలసిన పదార్థాలు


  • పనీర్. 1/2కేజీ
  • మెంతి ఆకులు. 3 కప్పులు
  • మిరియాల పొడి. 1 టీస్పూ//.
  • శెనగపిండి. 1.1/2 కప్పు
  • నూనె. తగినంత
  • జీలకర్ర. 2 టీస్పూ//.
  • టొమోటో గుజ్జు. 1 కప్పు
  • నీరు. తగినన్ని
  • తాజా మీగడ. 2 టీస్పూ//.
  • ఉప్పు. సరిపడా

తయారు చేయు విధానము:


సెనగపిండిలో ఉప్పు కలపాలి. పనీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా కోసి సెనగపిండిలో దొర్లించాలి.
వెడల్పాటి బాణెలిలో కొద్దిగా నూనె వేసి పనీర్‌ ముక్కల్ని బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించి పక్కన ఉంచాలి.
అదే బాణలిలో మిగిలి ఉన్న నూనెలోనే టొమాటో గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి 30 నిమిషాలపాటు తక్కువ మంటమీద ఉడికించాలి.
తరవాత పనీర్‌ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి మీగడ వేసి కలపాలి. అంతే మెంతి ఆకులతో పనీర్ కర్రీ రెఢీ.

No comments:

Post a Comment