Friday, May 18, 2012

కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా విచారానికి చెక్!?

కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖం వంటి మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

ఇదేంటి.. కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఊబకాయం, హృద్రోగ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే.. ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖానికి చెక్ పెట్టవచ్చని చెపుతున్నారు అనుకుంటున్నారా.

ఇది నిజం.. బెల్జియంకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధక బృందం నిర్వహించిన పరిశోధనలో తేలినట్టు వెల్లడైంది. మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే విధంగా ఫాట్ సొల్యూషన్ పనికివస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

విచారంతో పాటు.. ఒబేసిటీ, మానసిక ఒత్తిడి కూడా ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా తగ్గుతుందని వెల్లడైంది. ఫాటీ ఫుడ్‌తో విచారణ కలిగించే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఈ పరిశోధన నిర్వహించిన బెల్జియం యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధకులు వెల్లడించారు.

No comments:

Post a Comment