
కావలసిన పదార్థాలు
- బంగాళాదుంపలు. 1/2 కేజీ
- ఉప్పు. తగినంత
- మిరియాలపొడి. 2 టీస్పూ//.
- నిమ్మకాయలు. 2
- సేమ్యా. 200 గ్రా.
- కోడిగుడ్లు. 2
- నూనె వేయించేందుకు సరిపడా
తయారీ విధానం
బంగాళాదుంపల్ని తొక్క తీసి ఉడికించాలి. దుంపలు కాస్త చల్లారాక వాటిని గరిటెతో మెత్తగా మెదపాలి.
అందులోనే మిరియాలపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కోడిగుడ్డు ఆకారంలో ఉండలుగా చేయాలి.
ఓ చిన్నగిన్నెలో గుడ్లసొన వేసి బాగా గిలకొట్టాలి.
ఉండలుగా చేసిన దుంప ముద్దల్ని గుడ్డుసొనలో ముంచి తరవాత సేమ్యాలో దొర్లించి
తీయాలి.ఇలానే అన్నీ చేసుకోవాలి.
ఓ బాణలిలో సరిపడా నూనె పోసి కాగుతుండగా, పైన తయారు
చేసిన ఉండల్ని వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే వేడి
వేడి పొటాటో పెప్పర్ బర్డ్ నెస్ట్ రెఢీ.
No comments:
Post a Comment