Thursday, May 3, 2012

వెజిటబుల్స్‌తో అట్టు

కావలసిన పదార్థాలు

  • పెసరపప్పు. 150 గ్రా
  • మినపప్పు. 150 గ్రా
  • కందిపప్పు. 150 గ్రా
  • బియ్యము. 150 గ్రా
  • ఆలుగడ్డలు. 2
  • ఉల్లి గడ్డ. 1
  • క్యాబేజీ. తరుగు 1 కప్పు
  • పచ్చిమిర్చి. తరుగు 1/2 కప్పు
  • జీలకర్ర. 2 టీస్పూ//
  • కొత్తిమీర. తరుగు 1 కప్పు
  • నూనె. కొద్దిగా
  • ఉప్పు. సరిపడా

తయారీ విధానం

పెసర, మినప, కంది, శెనగ పప్పులను గంటసేపు నానెబెట్టి రుబ్బుకోవాలి.
ఈ పిండిలో ఉల్లిగడ్డ, క్యాబేజీ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగుల్ని చేర్చుకోవాలి.
ఈ మిశ్రమం ఇడ్లీ పిండిలా తయారైన తర్వాత. కొద్ది కొద్దిగా తీసుకుని పెనం మీద దోసెలుగా పోసి ఎర్రగా కాలిన తర్వాత దించేయాలి.
అంతే వెజిటబుల్స్‌తో తయారైన అట్టు సిద్ధమైనట్లే..! దీన్ని వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment