
కావలసిన పదార్థాలు
- మైదా. 1 కప్పు
- పాలకూర. 1 కప్పు
- తోటకూర. 1 కప్పు
- పనీర్. 1/2 కప్పు
- వెన్న. 2 టీస్పూ//
- ఉప్పు. తగినంత
- కారం. తగినంత
- జీలకర్ర పొడి. 1/2 టీస్పూ//
- నూనె. 2 టీస్పూన్లు
తయారీ విధానం
మైదాపిండిలో చిటికెడు ఉప్పు, నూనె కలిపి తగినంత నీటితో ముద్దలాగా చేసుకోవాలి.
ఈ ముద్దను అరగంటసేపు నానబెట్టాలి. ఈలోపు పాలకూర, తోటకూరలను శుభ్రం చేసుకుని. సన్నగా తరిగాలి.
అలాగే పనీర్ను కూడా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణెలి లో వెన్న వేసి వేడయిన తరువాత ఆకుకూరను వేసి వేయించాలి.
ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పనీర్ తురుమును కూడా అందులో వేసి ఐదు నిమిషాలపాటు వేయించి, దించేయాలి.
మైదా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పూరీ కన్నా కాస్తంత మందంగా ఒత్తుకోవాలి.
పైన వేయించి ఉంచుకున్న ఆకుకూరల మిశ్రమాన్ని ఈ పూరీల మధ్యలో ఉంచి కొసలను మూసేయాలి.
మొత్తం పిండినంతా అలా చేసుకున్న తరువాత వాటిని ఓవెన్లో పదిహేను నిమిషాల పాటు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి.
ఓవెన్లో వద్దనుకునేవారు నూనెలో కూడా వీటిని వేయించుకోవచ్చు. అంతే. పాలకూర మైదా గ్రీన్ పౌచ్ రెడీ అయినట్లే.
No comments:
Post a Comment