
కావలసిన పదార్థాలు
- పెసరపప్పు. 1/4 కేజీ
- అల్లం ముక్క. పెద్దది
- పచ్చిమిర్చి తరుగు. 1/2 కప్పు
- జీలకర్ర. 1 టీస్పూ//.
- ఉప్పు. 1/2 టీస్పూ//.
- కొత్తిమీర తరుగు. 1/2 కప్పు
- వంటసోడా. చిటికెడు
- నూనె. అట్లు కాలడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా పొట్టు తీయని పెసరపప్పును రెండు గంటలసేపు నానబెట్టి, రుబ్బి ఉంచుకోవాలి.
కాస్త చిక్కగా ఉండే ఈ పెసరపప్పు పిండిలో అల్లం,
పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులను, సరిపడా ఉప్పు, చిటికెడు వంటసోడాను వేసి
కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్పై పెనం పెట్టి, వేడయ్యాక గరిటెడు పెసరట్టు పిండిని తీసుకుని దోసెలాగా పోసి, ఉల్లిపాయ తరుగును చల్లాలి.
తరువాత సరిపడా నూనెను అట్టుపైన, అంచుల్లోనూ స్పూన్తో వేయాలి. సన్నని మంటమీద అట్టును రెండువైపులా కాల్చి తీసేయాలి.
వీటిని వేడి, వేడిగా ఉన్నప్పుడే గ్రీన్ చట్నీ లేదా పల్లీల పచ్చడితో కలిపి తింటే...మంచి రుచితో మిమ్మల్ని అలరిస్తాయి.
No comments:
Post a Comment