Wednesday, June 19, 2013

తలనొప్పి, అసహనం రుగ్మతలు పీడిస్తున్నాయా..?! 7 గంటలు నిద్రపోండి

* నీటిని ఎంత ఎక్కువగా తాగితే మన శరీరానికి అంత మంచిది, దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
* కొంత వేడి నీటిలో 1 కప్పు నువ్వులను దాదాపు రెండు గంటలు నానబెట్టిన తరువాత వాటిని మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని ఒక కప్పు పాలతో కలిపి, అందులో కొంచెం బెల్లం వేసి రోజూ తీసుకుంటే అజీర్తి తొలగి పోయి మంచి జీర్ణశక్తి మీ సొంతమవుతుంది.
* నువ్వులను ఎరుపురంగు వచ్చేవరకు వేయించి, పొడి చేసుకోవాలి, ఈ పొడిలో కొంచెం నెయ్యి వేసి రోజూ మూడు పూటలా పాలతో పాటు తీసుకోవాలి, ఇలా పదిరోజులు చేస్తే మలబద్దకం పరారవుతుంది.
* ఫాస్ట్ ఫుడ్‌ను దూరంగా పెట్టి పోషక విలువలు ఎక్కువ ఉండే ఆకుకూరలు, కాయగూరలను సమృద్ధిగా తింటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
* దగ్గు, జలుబు లాంటి ప్రతి చిన్న సమస్యకు అల్లోపతి మందుల వాడకాన్ని తగ్గించండి. ఆయుర్వేదంలో పేర్కొన్న ప్రకృతి వరప్రసాదాలు శొంఠి, మిరియాలు లాంటి వాటితో కషాయము చేసి తీసుకుంటే మంచిది.
* కనీసం 6 లేక 7 గంటలవరకు నిద్రపోవాలి, నిద్ర మనకు చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది తలనొప్పి, అసహనం, ఏ విషయంపైనా సరయిన ఏకాగ్రత లేకుండా చేయడం లాంటి సమస్యలకు కారణమవుతుందని గుర్తుంచుకోండి.

No comments:

Post a Comment