Wednesday, June 19, 2013

ఆహారంలో ఉప్పు తగ్గిస్తే రక్తపోటుకు చెక్...

* బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇందుకు క్రమం తప్పక ఏరోబిక్స్ చేయాలి. ఉదా : నడక. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

* ఆహారంలో ఉప్పు తగ్గించాలి. దీనికి బదులుగా ఆహారంలో ఎక్కువ మొత్తం పొటాషియం గల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

* పొగాకు ఉత్పత్తులు, పొగతాగడం, ఆల్కహాల్, సారాయి, మాదకద్రవ్యాలు వంటివి మోతాదు మించి సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

* రక్తనాళాలు విశాలం అవడానికి విటమిన్ -బికి చెందిన నియాసిస్ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన మాత్రలు వాడటానికి వైద్యుల సలహా తప్పనిసరి.

* గోధుమ ఊక, వేరుశనగపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, కోడిగుడ్డు, చేపలలో బి - విటమిన్ ఎక్కువ.

No comments:

Post a Comment