Wednesday, June 19, 2013

తేనెతో కాలిన గాయాలకు చెక్ పెట్టండి...!

* కిందపడినప్పుడు దెబ్బ తగిలి రక్తం వస్తుంటే దాన్ని ఏదైన సుభ్రమైన వస్త్రంతో అదిమి నట్టు పట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత క్రీమ్‌ని రాసి గట్టిగా కట్టు కట్టాలి.

* కాలిన చోట తేనెతో పూతలా వేస్తే మంట, నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

* గాయాలు తగిలినప్పుడు, ఒక గిన్నెలో వెనిగర్‌ను, నీళ్లను సమంగా తీసుకొని, దూదితో గాయం తగిలిన ప్రాంతంపైన తుడిస్తే సెప్టిక్ అవ్వకుండా ఉంటుంది.

* చర్మం లోపలి వరకూ వెళ్లి సూక్ష్మక్రిములతో పోరాడే గుణం తేనెకి మాత్రమే కలదు. కావున తేనెని గాయము తగిలిన వెంటనే వాడాలి.

* రెండుమూడు టీబ్యాగుల్లోని మిశ్రమాన్ని కప్పులో తీసుకొని దాన్ని నిండా నీళ్లు పోసి మరిగించాలి. అందులో కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసి డికాక్షన్ తయారుచేసి చల్లారాక దూదిన ముంచి గాయాలు లేదా పుండ్ల మీద తుడవాలి.

No comments:

Post a Comment