Wednesday, June 19, 2013

ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు

మీరు చిగుళ్ల నొప్పి, నిద్రలేమి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.

* చిగుళ్లు, పళ్లకు సంబంధించిన అనారోగ్యం ఉంటే నువ్వులనూనెలో లవంగ నూనె కలిపి వేలితో చిగుళ్ల మీద రుద్దాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా మర్దన చేస్తుంటే చిగుళ్లు గట్టిపడతాయి.

* నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాల సేపుపాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్దన చేయాలి.

* మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి మీద మర్దన చేయాలి. రాత్రి పూట మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.

* నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది.

* డయేరియా ఉన్నప్పుడు మజ్జిగ, పండ్ల రసం, కొబ్బరినీళ్లు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కూల్‌డ్రింకులు మాత్రం తీసుకోకూడదు

No comments:

Post a Comment