Tuesday, June 18, 2013

ఏ పండు ఏ వ్యాధిని రాకుండా చేస్తుందో తెలుసా...?!!

కొన్నిరకాల రుగ్మతల నివారణలో ఏ రకం పండ్లు ఏ భాగానికి మేలుచేస్తాయో తెలుసుకోవాలి. గుండెను పరిరక్షించి వ్యాధులతో పోరాడే శక్తిని ఇచ్చే పండ్లలో ముందుగా ద్రాక్షలు ఉన్నాయి. వీటిలో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే పాలిఫినాల్స్ పనిచేస్తాయి.

బొప్పాయి, పుచ్చపండ్లలో బిటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువుగా ఉంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ నుంచి కాపాడతాయి. ఇతర రకాల క్యాన్సర్ల నుంచి కాపాడే లికోపెన్లు లభిస్తాయి. బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి బాగా సహకరిస్తుంది. చర్మసంరక్షణలో జామ, ఆరెంజ్ పండ్లది కీలక స్థానం. ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది. మధ్యస్తంగా వుండే కమలా పండులో కంటే ఇది ఎక్కువుగా వుంటుంది.

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతా వారికంటే తక్కువుగా ఉంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది. రక్తపోటును తగ్గించగల పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది.

కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం గంగిరేగుపళ్ళలో, యాపిల్స్‌లో ఎక్కువుగా లభించగలదు. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్లనుంచి లభిస్తుంది. పీచు పదార్థాలు ఎక్కువుగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువుగా వుంటాయని కూడా పరిశోధనలు పేర్కొంటున్నాయి.

No comments:

Post a Comment