Tuesday, June 18, 2013

మధుమేహా వ్యాధిగ్రస్తులు తియ్యని పండ్లను తినాలనుందా...?

మధుమేహాం వ్యాధి ఉన్న వారు ఏమీ తినలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. తియ్యని పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని చాలా మంది మధుమేహా వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉంటారు. కానీ, నిజానికి మధుమేహగ్రస్తులకు ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆరోగ్యకరమైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లు ఒకసారి చూద్దాం.

ముఖ్యంగా మనకు దొరికే అన్ని రకాల బెర్రీ పండ్లు రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, మరియు బ్లాక్ బెర్రీ మధుమేహ గ్రస్తుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ యాపిల్ తినడం వల్ల వైద్యుల అవసరం ఉండదంటారు. ఆపిల్స్‌లో పెక్టిన్ అధికంగా ఉంటుంది. రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ తగ్గిస్తుంది. కాబట్టి తాజాగా ఉండే యాపిల్స్, లేదా జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ గ్లైసిమిక్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది.

మధుమేహగ్రస్తులు తినగలిగే ద్రాక్ష ఒకటి. ఇందులో శరీరానికి హాని కలిగించే పిండి పదార్థాలు కలిగి ఉంటాయి కాబట్టి తగు మోతాదులో తీసుకోవాలి. వీటిలో లో కెలోరీస్ కలిగి ఉండటమే కాకుండా, వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. ఇంకా రేగు పండ్లు వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ మధుమేహగ్రస్తులకు మరియు హార్ట్ పేషంట్స్ కు చాలా మేలు చేస్తుంది.

No comments:

Post a Comment