Tuesday, June 18, 2013

భోజనానికి అరగంట ముందు వేడినీరు తాగితే.. ఏమౌతుంది?

నగరాల్లో ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసే వారు ఐస్ వాటర్ సేవించడం ఫ్యాషనైపోయింది. అయితే ఐస్ వాటర్ కంటే వేడినీటిని తాగడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శొంఠి పొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

అలాగే వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని, తలనొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడినీరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఇంకా విందుల్లో ఫుల్‌గా లాగించారా.. అయితే ఒక గ్లాసు వేడినీరు తాగేస్తే చాలు.. అజీర్ణ సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మృదువైన చర్మం కోసం బార్లీ పౌడర్ ఒక టేబుల్స్ స్పూన్ వేసి కాచిన నీటిని అప్పుడప్పుడు తాగడం మంచిది. కాళ్లు, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే వేడి నీటిలో తగినంత ఉప్పు వేసి.. ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే కాళ్ల నొప్పులుండవు. పాదాల నొప్పులు, పగుళ్లకు ఈ నీటిలో 15 నిమిషాల పాటు మీ పాదాలను ఉంచితే మంచి ఫలితముంటుంది.

దాహం వేస్తే చల్లటి నీరు తాగడం కంటే వేడినీటిని తాగితే శరీరంలోని మలినాలంతా తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు వేడినీరు తాగితే శరీర బరువు తగ్గుతుంది. ఊబకాయానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment