Wednesday, June 19, 2013

ఆరోగ్యం కోసం సలాడ్లు ఉడికించిన కాయగూరలు తీసుకోండి..

శరీరంలోని వ్యర్థాలను వదిలించుకోవాలనుకుంటే ముందు చేయాల్సినది నీటిని సమృద్ధిగా తాగాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. వీటితో పాటు సి విటమిన్ ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిమ్మజాతి పండ్లలోనూ, అరటి, జామ వంటి వాటిల్లోనూ సి విటమిన్ అధికంగా ఉంటుంది.

* వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించి.. రోజులో రెండు లీటర్ల నీటిని తాగినా చక్కని ఫలితం ఉంటుంది. ఈ దిశగా మొదటి ప్రయత్నం మొదలయినట్టే.

* పదార్థాలు ఆకట్టుకొనేలా చేయడానికి వాటిల్లో ఉపయోగించే రంగులు, సువాసన కారకాలు.. మనలో వ్యర్థాలు చేరేటట్లు చేస్తాయి. సహజ రంగులని వాడుకొంటూ వీటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. మొలకలని నేరుగా, దంపుడు బియ్యం, మొక్క జొన్న, బార్లీలు వంటి వాటిని గంజి రూపంలో తీసుకొంటే శరీరం తేలిగ్గా ఉంటుంది.

* ఉడికించిన కూరగాయ ముక్కలని, చిక్కుడు జాతి రకాలయిన బీన్స్‌తో పాటు పెసలు, సెనగలు, రాజ్మా వల్ల వ్యర్ధాలు తొలగుతాయి. తాజా కాయగూరలు, బొప్పాయి, అంజీర, జామ వంటి వాటిని తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

* ఉప్పు వేయని పిస్తా, వేరుసెనగ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్, గుమ్మడి గింజలను తగు మోతాదులో తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

* ఇంట్లో చేసిన పెరుగు, ఆలివ్‌నూనె, అల్లం వెల్లుల్లి, వెన్న వేయని పాప్‌కార్న్, తేనె.. హెర్బల్ టీ తాగాలి.

* నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, కేకులు బిస్కెట్లు బాగా తగ్గించుకోవాలి.

* బరువు తగ్గాలనుకొనేవారు.. కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి, నిత్యం కొవ్వు పదార్థాలు, పాల ఉత్పత్తులు, మాంసం, శుద్ధి చేసిన పదార్థాలు అతిగా తినేవారు తప్పనిసరిగా డిటాక్సిఫికేషన్‌ని తప్పక దృష్టి పాటించాలి. 

No comments:

Post a Comment