Wednesday, June 19, 2013

రక్తహీనతతో బాధపడుతుంటే ఏం చేయాలి?

దేశంలో అత్యధిక శాతం మంది మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య రక్తహీనత. రక్తహీనతను తగ్గించుటకు పోషకాహారములు అధికముగా వాడినట్లైతే చాలు.

* స్త్రీలను అలసట బారిన పడేయంతో పాటు అనారోగ్య సమస్యలకీ దారితీసె రక్తహినత నుంచి తప్పించుకోవాలంటే ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

* బీన్స్, పచ్చ బఠాణీ, రాజ్‌మా పెసలు, కీరదోస, గుడ్డు, మాంసం వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.

* బాదం, పిస్తా, వాల్‌నట్, వేరుసెనగపప్పులను కూడా అధికంగా తీసుకోవాలి.

* ఖర్జూరం, ద్రాక్ష, అంజూర్ వంటి ఎండుఫలాలని తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు.

* విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరం ఆహారం నుంచి ఇనుమును అధికంగా స్వీకరిస్తుంది.

* భోజనము తర్వాత టీ, కాఫీలు తాగకూడదు. తాగినట్లైతే శరీరానికి ఇనుము అందదు.

No comments:

Post a Comment