Wednesday, June 19, 2013

చేప, అవిసెగింజల నూనెతో రక్తపోటుకు చెక్

* రక్తపోటుకు ప్రధానమైన శత్రువు ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించుకోగలిగితే ఎన్నో జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు.

* ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి ధ్యానం, యోగా.. వంటి మార్గాలను అనుసరించాలి. అలాగే మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణంలో కొద్ది సేపు తిరగాలి.

* నిత్యం చెవులు చిల్లులుపడే రణగొణధ్వనులు, అమితమైన లైట్ల వెలుతురులో ఎక్కువ రోజులు ఉన్నా రక్తపోటు సమస్య వస్తుంది. అందుకని వీటికి కొంతకాలం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

* ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటు తీవ్రతను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి చేప నూనెల్లో, అవిసె గింజల ద్వారా తీసిన నూనెల ద్వారా లభిస్తాయి.

* ఆహారంలో మార్పుల ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఆహార ప్రణాళికలో ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, కొవ్వుశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి.

No comments:

Post a Comment