Wednesday, June 19, 2013

సులువైన ఆహారనియమాలతో డయాబెటిస్‌ని దూరం చేసుకోండిలా...

మన దేశంలో ప్రస్తుతం డయాబెటిస్ రోగుల సంఖ్య చాలా ఎక్కువ. కాస్త వయస్సుపైబడితే స్త్రీ, పురుషులు ఇద్దరిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకున్నట్లైతే, డయాబెటిస్ మన దరికి చేరకుండా ఆరోగ్యాన్ని క్షేమంగా కాపాడుకోవచ్చు.

* మొలకెత్తిన గింజలు తింటే శరీరములోని అన్నిరకాల వ్యాదులకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

* ఆహారంలో పొట్టుతో ఉన్న రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలు తీసుకోవాలి.

* పళ్లు ఏమైన కొరికి, నమిలి తినాలి. అయితే పళ్లరసాలు మాత్రం తాగకూడదు.

* పళ్లు తన్నేటప్పుడు ఎక్కువ తీపి కలిగన పండ్లు తినకూడదు. ముఖ్యంగా ఖర్జూరం, అరటి పండు, మామిడి వంటి పండ్లు తీసుకోకూడదు.

* తీపి పరిమితంగా ఉండే బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు ఎక్కువగా తినవచ్చు.

* తగినంత శారీరక శ్రమ చేసేలా జాగ్రత్త తీసుకోవాలి.

* ఆహారం మితంగా తగినంత మాత్రమే తీసుకోవాలి.

No comments:

Post a Comment