Friday, June 28, 2013

రాత్రివేళ కొరివి దెయ్యాలు ఉంటాయా?

రాత్రి వేళ పొలాల్లో కొరివి దెయ్యాలను తాము చూశామని చాలా మంది గ్రామీణులు చెపుతుంటారు. ముఖ్యంగా ఈ తరహా దెయ్యాలు ఎక్కువగా అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయని, మంటతో నడుస్తూ, పరుగెత్తుతూ వెళుతుంటాయని చెపుతుంటారు.


అయితే, రాత్రి పూట మంటలు కనిపించడం సహజమేనని పలువురు చెపుతారు. ఈ మంటలు కొరివి దెయ్యాలకు చెందినవి కావని, పక్షుల రెట్టలు, వృక్ష, జంతుజాల అవశేషాలలో ఉండిపోయే సోడియం, గంధకం, ఫాస్పరస్ వంటివి తేలికగా మండే గుణంగల ధాతువులు భూమి మీద ఉష్ణోగ్రత మార్పుల వల్ల మండుతాయన్నది నిజం.


ఇదే తరహా మార్పులు పగటి పూట కూడా చోటు చేసుకుంటాయి కూడా. అయితే, భానుడి వెలుగుల ముందు అవి కంటికి కనిపించవని చెపుతున్నారు. రాత్రివేళ మండినపుడు చీకటి వల్ల కనిపిస్తాయని చెపుతున్నారు.

No comments:

Post a Comment