Wednesday, June 19, 2013

వర్షాకాలంలో పాదాలు... జాగ్రత్తలు

చెప్పులు లేకుండా పాదాలు తరచూ నీళ్లలో తడిస్తే పాదాల నుంచి ఒక రకమైన వాసన రావచ్చు. బూట్లు వేసుకుంటే పాదాల్లో ఉండే తడికి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీనివల్ల పాదాలు దుర్గంధపూరితమవుతాయి. ఒకవేళ సాక్సులు లేకుండా ఉంటే పాదాలకు పోసే చెమటను పీల్చుకునే సదుపాయం ఉండదు. అందువల్ల ఫంగస్ నిరోధక పౌడరును పాదాలకు వాడినట్లయితే పాదాలు పొడిగా ఉంటాయి.

రాత్రిపూట బ్యాక్టీరియాను నాశనంచేసే వెనిగర్ కలిసిన నీటిలో పాదాలు ముంచి శుభ్రం చేసుకోవాలి. ఒక భాగం వెనిగర్, రెండు భాగాలు నీరు కలపాలి. అలాగే బ్లాక్ టీతో 30 నిమిషాలపాటు పాదాలు తడిసేలా ఉంచినా మంచి ఫలితం కనబడుతుంది.

టానిస్( ఒక చెట్టు బెరడు) కూడా బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. సూక్ష్మరంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల పాదాలు ఎక్కువసేపు పొడిగా ఉంటాయి.

No comments:

Post a Comment