కావలసిన పదార్థాలు
- మెంతి ఆకులు.. గుప్పెడు
- చింతపండు. నిమ్మకాయంత
- ఉప్పు.. సరిపడా
- పసుపు.. చిటికెడు
- పచ్చిమిర్చి. 4
- ఉల్లిపాయ. 1 (చిన్నది)
- ఎండు మిర్చి. 3
- ఆవాలు, 1 టీస్పూ//
- మినపప్పు, 1 టీస్పూ//
- జీలకర్ర, 1 టీస్పూ//
- మెంతులు. 1 టీస్పూ//
- కరివేపాకు. కొద్దిగా
- వెల్లుల్లి. 2 రేకలు
- నూనె. 2 టీస్పూ//
తయారీ విధానం
ఒక లీటరు నీటిలో చింతపండు, మెంతి ఆకులు, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరిగించి దించాలి.
బాణలిలో నూనె వేసి పైన చెప్పిన పోపు సామగ్రి అంతా వేయించి చారులో కలపాలి.
ఈ మెంతి ఆకుల చారు మధుమేహ (షుగర్) వ్యాధి ఉన్న వారికి చాలా మంచిది.
No comments:
Post a Comment