కావలసిన పదార్థాలు
- శనగ పప్పు:1 కప్పు
- మినపప్పు: 1 కప్పు
- చింతపండు:చిన్న నిమ్మకాయంత
- ఎండు మిరపకాయలు(ముక్కలు చేసినవి): 1/2 కప్పు
- ఎండు కొబ్బరి(తురిమినది):1 కప్పు
- బెల్లం: 1/2 కప్పు
- ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా బాణెలి లో శనగ పప్పు, మినపప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, ఎండు కొబ్బరి విడివిడిగా వేయించుకోవాలి.
ముందుగ పప్పులు రెండు మిక్సిలో వేసి మెత్తగ పొడి
చేసుకోవాలి. కొంచెం పొడి విడిగా తీసుకుని మిగిలిన పొడిలో చింతపండు వేసి
పొడి చేసుకోవాలి.
ఆ పొడిని పైన విడిగ తీసుకున్న పొడిలో కలుపుకోవాలి.
మళ్ళీ కొంచెం పొడి విడిగా తీసుకుని దానికి ఎండు మిరపకాయలు కలిపి పొడి చేసుకుని దీనిని మొత్తం పొడిలో కలుపుకోవాలి.
ఇలానే ఎండు కొబ్బరి, బెల్లం కూడా విడివిడిగా మిక్సిలో వేసుకుని పొడి చేసుకోవాలి.
ఇలా అన్ని పొడిచేసుకున్న తర్వాత ఉప్పు వేసి కలుపుకుని నెయ్యి వేసి పోపు వేసుకోవాలి.
ఈ పొడి కొంచెం తియ్యగా వుంటుంది. అన్నంలో, దోస, ఇడ్లీలలోకి బాగుంటుంది.
No comments:
Post a Comment