కావలసిన పదార్థాలు
- ఒకటిన్నర కప్పు సేమ్యా, నేతిలో ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొన్నది.
- మూడు లేక నాలుగు పచ్చి మిరపకాయలు
- అల్లం చిన్న ముక్క తరిగినది.
- తొక్కు తీసి తురిమిన మామిడి కోరు - మూడొంతుల కప్పు
- కాజు
- నూనె తగినంత
- నెయ్యి తగినంత
- పోపు పెట్టుకోవడానికి తగినన్ని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు.
తయారీ విధానం
నాలుగు కప్పుల నీటిలో ఒక చెంచా నూనె, ఒక అర చెంచా ఉప్పు వేసి, సేమ్యాను మెత్తగా ఉడికించుకోవాలి.
సేమ్యా ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి. మెత్తగా ఉడికిన సేమ్యాను వార్చుకొని, చల్ల నీరు చల్లి, ఒక పక్కకు పెట్టుకోవాలి.
ఒక బాణెలిలో రెండు చెంచాల నూనె వేసుకొని, కొంచం వేడి కాగానే ఆవాలు వేసి, చిట పటలాడనిచ్చుకోవాలి.
దీనికి మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు పోపు
వేసుకొని, చక్కగా వేగనివ్వాలి. దీనికి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం కోరు
తగిలించి వేగనివ్వాలి.
ఇప్పుడు దీనికి మామిడికాయ కోరు కలుపుకొని రెండు
మూడు నిమిషాలు వేగనివ్వాలి. దీనికి తగినంత ఉప్పు వేసి (సేమ్యాలో ఒక సారి
వేసుకున్న విషయం మర్చిపోవద్దు సుమా!) కలుపుకోవాలి.
దీనిలో సేమ్యా వేసుకొని, మిశ్రమం బాగా
కలుపుకోవాలి. ఎక్కడా ముద్దలు కాకుండా చూసుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఉప్పు సరి
చూసుకోండి, అంతే పుల్ల పుల్లని మామిడి సేమ్య ఉప్మా తయార్!
No comments:
Post a Comment