కావలసిన పదార్థాలు
- అరటికాయలు. 2
- పచ్చిమిర్చి. 4
- ధనియాలు. 2 టీస్పూ//.
- చింతపండు. 25 గ్రా.
- వెల్లుల్లి. పది రేకలు
- జీలకర్ర. 5 గ్రా.
- పెరుగు. 1/4 లీ.
- ఉల్లిపాయ. 1
- కరివేపాకు. 2 రెబ్బలు
- కొత్తిమీర. 1 కట్ట
- ఆవాలు. 1/2 టీస్పూ//.
- నూనె. సరిపడా
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
అరటికాయలు తొక్కు తీసి ముక్కలుగా కోసి ఉడకబెట్టాలి.
బాణెలి లో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, దనియాలు, వెల్లుల్లి, జీలకర్ర
వేసి వేయించాలి.
చింతపండు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు , పచ్చిమిర్చి పోపు. అన్నీ మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా రుబ్బాలి.
ఇందులో పెరుగు వేసి కలపాలి. అందులోనే సన్నగా తరిగిన
ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలుతో
పోపు చేసి పచ్చడిలో కలిపితే పెరుగు పచ్చడి రెడీ.
No comments:
Post a Comment